మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ లో వరుసగా నాలుగు ఫ్లాప్ లు వచ్చిన కూడా తన స్పీడ్ మాత్రం తగ్గించడం లేదు.సినిమాల ఎంపికలో అందరికంటే స్పీడ్ గా ఉన్నాడు.
ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న రవితేజ నెక్స్ట్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.దీని తర్వాత త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఉంటుంది.
ఇలా హ్యాట్రిక్ మూవీ లతో స్పేడ్ మీద ఉన్న రవితేజ మరో దర్శకుడుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమా ద్వారా రచయిత నుంచి దర్శకుడు అవతారం ఎత్తిన వక్కంత వంశీ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.
వక్కంత తాజాగా ఫుల్ స్క్రిప్ట్ తో రవితేజ దగ్గరకి వెళ్లి మెప్పించడంతో ఈ కథకి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.మొదటి సినిమాతో కంటెంట్ పరంగా ఒకే అనిపించుకున్న వక్కంత ఈ సినిమా ద్వారా దర్శకుడుగా సాలిడ్ హిట్ కొట్టాలని మంచి కమర్షియల్ కథతో రవితేజని మెప్పించినట్లు తెలుస్తుంది.
త్వరలో ఈ సినిమా ఏ నిర్మాత నిర్మించడానికి ముందుకి వస్తాడు అనే విషయం అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది.