మాస్ మహారాజ్ రవితేజ సినిమాల విషయంలో వేగం పెంచారు.రవితేజ నటిస్తున్న ఖిలాడీ మూవీ షూటింగ్ త్వరలో పూర్తి కానుంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా రమేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.రవితేజ ఖిలాడీ సినిమా విషయంలో ఫిబ్రవరి సెంటిమెంట్ అభిమానులను తెగ టెన్షన్ పెడుతోంది.
క్రాక్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఖిలాడీ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలోకి వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఖిలాడీ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటించనున్నారు.
అయితే రవితేజ సోలో హీరోగా నటించి ఫిబ్రవరి నెలలో రిలీజైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.రవితేజ నటించిన షాక్, టచ్ చేసి చూడు, నిప్పు సినిమాలు ఫిబ్రవరి నెలలోనే విడుదలయ్యాయి.
షాక్ సినిమా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ కాగా నిప్పు సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ అయింది.
టచ్ చేసి చూడు సినిమా కూడా అదే తేదీన రిలీజ్ కావడంతో రవితేజ అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.బాక్సాఫీస్ వద్ద ఖిలాడీ ఏ స్థాయిలో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.ఈ ఏడాది మే నెలలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది.
ఖిలాడీ సినిమాతో రవితేజ క్రాక్ సక్సెస్ ను కంటిన్యూ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఖిలాడీ సినిమాను నిర్మించారు.ఈ సినిమాకు బిజినెస్ బాగానే జరిగిందని సమాచారం.ఖిలాడీ ఎంట్రీతో అదే రోజు రిలీజ్ కావాల్సిన అడివి శేష్ మేజర్ మూవీ వాయిదా పడిందని తెలుస్తోంది.