కరోనా కారణంగా సినిమాల థియేటర్లు మార్చిలో లాక్ డౌన్ కు ముందే ఆగిపోయాయి.అప్పటి నుండి మొన్నటి వరకు థియేటర్లు ఓపెన్ కాలేదు.
థియేటర్లు ఓపెన్ అయినా కూడా జనాలు మాత్రం రావడం లేదు.జనాలు రావడం లేదనే కారణంతో సినిమాలు కూడా విడుదల అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు.
కరోనా తగ్గుముఖం పట్టిన కారణంగా థియేటర్లు పునః ప్రారంభం చేయడంతో పాటు సినిమాలు విడుదల చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీ తో నడిపేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన కారణంగా పెద్ద బడ్జెట్ సినిమాలకు అది వర్కౌట్ అవ్వదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు.
అందుకే పెద్ద సినిమాల విడుదలకు ఆసక్తి చూపడం లేదు.
సినిమాలు ఏమీ రాని ఈసమయంలో ఈ క్రిస్మస్ కు సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సోబెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సంక్రాంతి కానుకగా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా విడుదల కాబోతుంది.ఈ రెండు సినిమాలు కూడా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక దారి చూపుతున్నాయి.
వీరు చేసిన ధైర్యం కు ఫలితం దక్కుతుందా లేదా అనేది చూడాలి.ఒక వేళ ఫలితం పాజిటివ్ గా వచ్చి కమర్షియల్ గా నిరాశ పర్చితే మాత్రం ఇతర సినిమాలు వచ్చే అవకాశం లేదు.
ఒక వేళ ఫలితం మిశ్రమంగా వచ్చి కమర్షియల్ గా మంచి వసూళ్లు రాబడితే మాత్రం ఖచ్చితంగా సినిమాలు వరుసగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.వరుసగా రవితేజ మరియు సాయి ధరమ్ తేజ్ లు చేస్తున్న ఈ ప్రయోగం ఎంత వరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.
ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే వరుసగా సినిమాలు వస్తాయేమో చూడాలి.
తాజా వార్తలు