క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ ఖిలాడిగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.రమేష్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా రిలీజ్ డేట్ కోసం చూస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత శరత్ మండవ డైరక్షన్ లో రవితేజ సినిమా చేస్తున్నారు.
రవితేజ కెరియర్ లో 68వ సినిమాగా ఈ మూవీ వస్తుంది.ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయింది.
సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈరోజే సినిమాకు సంబందించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ మాస్ రాజా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు.థ్రిల్లర్ కథాంశంగా వస్తున్న ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ లుక్ కూడా అదిరిపోతుందని అంటున్నారు.
ప్రీ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన రవితేజ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.ఈ సినిమా తర్వాత రవితేజ నక్కిన త్రినాథ రావు డైరక్షన్ లో సినిమా చేస్తారని తెలుస్తుంది.
ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా త్వరలో వస్తుందని తెలుస్తుంది.