సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద పెట్రోల్‌ బాటిల్‌తో హల్‌చల్‌

ఇటీవల ఎమ్మార్వోను సురేష్‌ అనే వ్యక్తి పెట్రోల్‌ పోసి చంపేయడంతో పాటు తాను చనిపోయాడు.ఈ సంఘటనలో ఇప్పటికే ముగ్గురు చనిపోగా మరొకరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.

 Ravindar Take The Petrol Battle Hulchul In Cm Camp Office-TeluguStop.com

ప్రస్తుతం ప్రభుత్వం అధికారుల్లో పెట్రోల్‌ అంటేనే భయం వేస్తోంది.పెట్రోల్‌ పోసి ఎక్కడ నిప్పు పెడతారో అంటూ ఆందోళన చెందుతున్నారు.

కొందరైతే తమ దగ్గరకు కూడా రాకుండా దూరంగా ఉంచేస్తున్నారు.ఇలాంటి సమయంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఒక వ్యక్తి పెట్రోల్‌ బాటిల్‌తో ప్రత్యక్షం అయ్యాడు.

మంచిర్యాలకు చెందిన రవీందర్‌ అనే వ్యక్తి తన కేబుల్‌ నెట్‌వర్క్‌ను కొందరు స్వాదీనం చేసుకున్నారంటూ ఆరోపించాడు.ఎంపీ మరియు ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు పట్టించుకోలేదని, అందుకే తనకు న్యాయం చేయాలంటూ సీఎంను కలిసేందుకు వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇక్కడ కూడా నాకు న్యాయం జరగకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన చెప్పాడు.విషయం గమనించిన పోలీసులు వెంటనే అతడి నుండి పెట్రోల్‌ బాటిల్‌ను లాక్కుని అతడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్బంగా అతడు తన ఆవేదన వినిపించేందుకు సీఎం కేసీఆర్‌ సమయం కేటాయించేందుకు ఆసక్తి చూపించక పోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube