బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా రవికృష్ణ నా పేరు మీనాక్షి, ఆమె కథ సీరియల్స్ ద్వారా నవ్యస్వామి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం నవ్యస్వామి, రవికృష్ణ స్టార్ మా ఛానెల్ లో ఆమెకథ సీరియల్ లో నటిస్తున్నారు.
అయితే ఈ జంట ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.అయితే ఈ జంట పెళ్లి చేసుకుంది ఈటీవీ ఛానల్ లో ప్రసరమయ్యే ఒక ఈవెంట్ కోసం రీల్ లైఫ్ లో కావడం గమనార్హం.
ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈటీవీ ఛానల్ లో శ్రీదేవి డ్రామా కంపెనీ పేరుతో ఒక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ప్రోమోలో రవికృష్ణ, నవ్యస్వామి హే పిల్లా అనే సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు.
ఆ తరువాత రవికృష్ణ నవ్య స్వామికి లవ్ యు ఐ అని చెబుతాడు.నవ్య స్వామి లవ్ యు ఐ ఏంటి అడగగా.? మన ఇద్దరి మధ్య లవ్ ఉండకూడదని అలా చెప్పానని రవికృష్ణ అనగా నవ్యస్వామి కూడా లవ్ యు ఐ అని చెబుతారు.
ఫిబ్రవరి 21వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.గతంలో సుధీర్ రష్మీ పెళ్లి పేరుతో ఈటీవీ ఛానల్ లో ఒక ఈవెంట్ జరగగా ఇప్పుడు కూడా అదే తరహాలో ఈవెంట్ లో చూపించారు.రవికృష్ణ నవ్యస్వామికి తాళ్లి కడుతున్నట్టుగా ప్రోమోలో చూపించడం గమనార్హం.
అయితే నెటిజన్లు మాత్రం టీఆర్పీ రేటింగుల కోసం ఛానెళ్లు ఈ తరహా ప్రోగ్రామ్ లను ప్లాన్ చేస్తున్నట్టు ఈటీవీ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.
షోపై ఆసక్తి పెంచడం కోసం చేస్తున్న ప్రయోగాలు కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాన్ని ఇస్తే కొన్నిసార్లు మాత్రం వికటిస్తాయి.
ఈటీవీ నిర్వాహకులు చేస్తున్న ఈ ప్రయోగం మంచి టీఆర్పీ రేటింగ్ లను తెచ్చిపెడుతుందేమో చూడాలి.