బన్నీ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన రేసుగుర్రం సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో రవి కిషన్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు.
ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో రవి కిషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించడం గమనార్హం.అయితే తాజాగా ఈ విలన్ తన స్నేహితుడిపై ఫిర్యాదు చేయడం నెట్టింట చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం రవి కిషన్ గోరఖ్ పూర్ కు ఎంపీగా ఉన్నారు.రవి కిషన్ పది సంవత్సరాల క్రితన్ తన ఫ్రెండ్, ప్రముఖ బిజినెస్ మేన్ లలో ఒకరైన జైన్ జితేంద్ర రమేష్ 3.25 కోట్ల రూపాయలు ఇచ్చారు.జితేంద్ర రమేష్ ఆ డబ్బును వెనక్కివ్వడంలో భాగంగా 34 లక్షల రూపాయల చొప్పున 12 చెక్కులను ఇచ్చారని సమాచారం.
ఆ చెక్కులలో ఒక చెక్కును రవికిషన్ గతేడాది డిపాజిట్ చేయగా ఆ చెక్కు బౌన్స్ అయింది.
ఆ తర్వాత రవికిషన్ చెక్ బౌన్స్ కావడం గురించి జితేంద్ర రమేశ్ ను సంప్రదించినా ఆయన నుంచి సరైన స్పందన లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.రవి కిషన్ కు భోజ్ పురితో పాటు దక్షిణాది భాషల్లో క్రేజ్ ఉంది.రవి కిషన్ లాంటి సినీ ప్రముఖులు స్నేహితుల చేతిలో మోసపోవడం చర్చనీయాంశమైంది.
రవి కిషన్ విలనిజంకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.రవి కిషన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
స్టార్ డైరెక్టర్లు దృష్టి పెడితే రవి కిషన్ రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది.రవి కిషన్ రెమ్యునరేషన్ రోజుకు 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.