ఐపీఎల్ సీజన్ 12 దేశవాళీ క్రికెట్ లీగ్ ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆసక్తిగా మారాయి.మరో వైపు గత మ్యాచ్ లో మన్కాడింక్ తో బ్యాట్స్ మెన్ ని అవుట్ చేసి విమర్శలు ఎదుర్కొన్న రవిచంద్రన్ అశ్విన్ మరో సారి ఈ రోజు మ్యాచ్ లో కూడా వార్తలలో నిలిచాడు.
తన మొదటి ఓవర్ బౌలింగ్ లో అశ్విన్ ఎంపైర్ తప్పిదం వలన ఓవర్ లో ఏడు బంతులు వేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ముంబై ఇండియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్కి దిగింది.
అయితే బౌలింగ్ అటాక్కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ప్రారంభించాడు.అయితే తొలి ఓవర్లో అశ్విన్ ఏడు బంతులు బౌల్ వేసి అందరికి ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఈ విషయం అంపైర్ కూడా గమనించకపోవడంతో ఇప్పుడు ఇది సంచలనంగా మారింది.మరో వైపు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్ తప్పుడు నిర్ణయం వలన అవుట్ అవ్వాల్సి వచ్చింది.
ఇప్పటికే ఈ సీజన్ లో వరుస వివాదాలు, మరోవైపు సంచలనాలతో ఆసక్తిగా మారాయి.ఈ నేపధ్యంలో ఈ రోజు పంజాబ్, ముంబై మధ్య మ్యాచ్ మరోసారి వార్తల్లో నిలిచింది.