యాంకర్ రవి పేరు ఎత్తగానే ఒకప్పుడు లాస్య అనే పేరు ఠక్కున వినిపించేది.వారిద్దరు ఎంతగా పాపులర్ అయ్యారంటే వారు పెళ్లి చేసుకోబోతున్నారు అన్నంతగా పాపులర్ అయ్యారు.
వారిద్దరి ప్రేమ కథ కథలు కథలుగా చెప్పుకోవడం జరిగింది.వారిద్దరి గురించి మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చినన్న వార్తలు ఏ బుల్లి తెర యాంకర్స్ గురించి వచ్చి ఉండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇద్దరి మద్య వ్యవహారం ముదరడంతో లాస్య వివాహం చేసుకుందని, ఇద్దరు అంతకు ముందు మరీ ఎక్కువ క్లోజ్ అయ్యారు అంటూ టాక్ వచ్చింది.
ఇక లాస్య వివాహం సమయంలో రవి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్దం అయ్యాడని, ఆమెను పెళ్లి చేసుకోకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడంటూ టాక్ వచ్చింది.ఇంత వ్యవహారం జరుగుతున్నా కూడా రవికి పెళ్లి అయ్యింది అనే విషయంపై ఎవరికి క్లారిటీ లేదు.కొందరు అంటూ ఉన్నా ఎవరు నమ్మలేదు.
ఎప్పుడైతే లాస్య పెళ్లి అయ్యిందో కాస్త గ్యాప్ తీసుకుని తన భార్య నిత్య సక్సేనాను జనాలకు పరిచయం చేశాడు.తనకు పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలు అయ్యిందని నాలుగు ఏళ్ల పాప ఉందని రవి ఫుల్ క్లారిటీతో ఫొటోలతో సహా పోస్ట్ చేశాడు.
తాజాగా మొదటి సారి నిత్యా సక్సేనాను బుల్లి తెర కామెడీ షోకు రవి తీసుకు వచ్చాడు.ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు కార్యక్రమంలో రవి మరియు నిత్యల డాన్స్ మరియు సందడి షోకే హైలైట్గా నిలిచింది.ఇక గతంలో రవి గురించి వచ్చిన వార్తలు మరియు పుకార్ల గురించి నిత్యను ప్రశ్నించిన సమయంలో ఆమె చాలా లైట్గా తీసుకున్నట్లుగా చెప్పింది.తనకు రవి అంటే ఏంటో తెలుసు, అతడి ఫీల్డ్ గురించి తాను పెద్దగా ఆ విషయాలను పట్టించుకోలేదు అంటూ నిత్య చెప్పుకొచ్చింది.
రవి మంచి వ్యక్తి అని, ఏం చేసినా ప్రొఫెషనల్గా మాత్రమే చేశాడంటూ ఆమె చెప్పడం జరిగింది.ఇద్దరి మద్య అన్యోన్యంకు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు ఆశ్చర్య పోయారు.