ప్రపంచం మెచ్చే చిత్రకారుల గురించి చెప్పుకుంటే పికాసో పేరు వినిపిస్తుంది.అదే ఇండియాలో అద్భుతమైన చిత్రకారుల పేర్లు చెప్పుకుంటే అందులో రవివర్మ పేరు వినిపిస్తుంది.
ఇక రవివర్మకే అందంది ఒకే ఒక అందానివో అంటూ కవి వర్ణించిన గీతాలతో అతని చిత్రకళా నైపుణ్యం ఏంటో అందరికి తెలుస్తుంది.ప్రపంచం మెచ్చిన అతి గొప్ప చిత్రకారులలో ఇతను కూడా ఉంటాడు.
అంత గొప్ప కళాకారుడు గీసిన చిత్రాలకి విలువ ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన కుంచె నుంచి జాలువారిన కళాఖండాలు ప్రపంచ ప్రాచుర్యం పొందాయి.
తాజాగా రవివర్మ సృష్టించిన విశ్వామిత్రుడి పెయింటింగ్ ఓ అంతర్జాతీయ వేలంలో కోట్ల ధర పలికింది.ప్రముఖ వేలం సంస్థ సోత్ బీస్ నిర్వహించిన ఆన్ లైన్ వేలం ప్రక్రియలో రవివర్మ గీసిన విశ్వామిత్రుడు పెయింటింగ్ ను ఓ అజ్ఞాత వ్యక్తి ఏకంగా 6.45 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు.కాగా, రెండేళ్ల కిందట రవివర్మ దమయంతి పెయింటింగ్ ఇంతకు రెట్టింపు ధరతో ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు.
తాజాగా, విశ్వామిత్రుడు పెయింటింగ్ కోసం గతనెలలో ఆన్ లైన్ బిడ్డింగ్ మొదలుపెట్టగా, రెండ్రోజుల కిందటే బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది.ఇందులో ఏకంగా అన్ని కోట్లు పెట్టి పెయింటింగ్ ని అజ్ఞాత వ్యక్తి సొంతం చేసుకోవడం మన రవివర్మ చిత్రాలకి ఎంత గుర్తింపు ఉందో అర్ధమవుతుంది.