మాస్ మహా రాజా కరోనా తర్వాత ఫుల్ జోష్ గా మారిపోయాడు.ఆయన ప్రస్తుతం ఐదారు సినిమాలతో బిజీగా ఉన్నాడు.
క్రాక్ కిరాక్ హిట్ అవ్వడంతో ఈయనకు మళ్ళీ మంచి రోజులు మొదలయ్యాయి.రెమ్యునరేషన్ పెంచిన కూడా రవితేజ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఈయన ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు.
ఈయన వంశీ కృష్ణ దర్శకత్వంలో స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నాడు.టైగర్ నాగేశ్వరరావు టైటిల్ తో ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.1970 స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.ఇప్పటికే ప్రీ లుక్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ అవ్వగా అందరు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.
ఒక దొంగ గురించి బయోపిక్ ఏంటా అని అంతా ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెట్టారు.
ఇప్పుడు ఇదే ఇంట్రెస్ట్ ను యూట్యూబ్ ఛానెల్స్ వారు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.నాగేశ్వరరావు స్నేహితులు, సన్నిహితులతో పాటు స్టువర్ట్ పురం మాజీ నేరస్థులను సైతం ఇంటర్వ్యూలు చేస్తూ ఇంట్రెస్టింగ్ థంబ్ నెయిల్స్ తో వదులుతున్నారు.ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ తన బ్యానర్ అయిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించ నున్నారు.
అలాగే నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది.