ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు.ఇదివరకే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఇక హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నారు.ఇది ఇలా ఉండగా నటి కియారా అద్వానీ వివాహ వేడుకలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా సెలబ్రిటీలందరూ కూడా పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.ఇదిలా ఉండగా రవితేజ హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన నేనింతే సినిమాలోని హీరోయిన్ శియా గౌతమ్ సోమవారం ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నటి శియా గౌతమ్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆమె భర్త పేరు నికిల్ పాల్కేవాలా అని తెలుస్తోంది.
ఇలా ఈమె హల్ది సంగీత్ వేడుకలతో పాటు పెళ్లికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇక వీరి వివాహానికి నటి ప్రియమణి దంపతులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.ఈమె నేనింతే సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా ఈమె నటనకు మంచి ప్రశంసలు అందాయి.
ప్రస్తుతం నటి శియా గౌతమ్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు