మాస్ మహారాజ్ రవితేజ కెరియర్ అందరికంటే ప్రత్యేకం అని చెప్పాలి.అసిస్టెంట్ దర్శకుడుగా ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా 50 కోట్ల మార్కెట్ తెచ్చుకునేంత వరకు అతని ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి.
అన్నింటిని అధికమించి సినిమానే లైఫ్ గా తన టాలీవుడ్ జర్నీ కొనసాగించారు.ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్ ఫుల్ కమర్షియల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.
రవితేజ సినిమా అంటే మాస్, యాక్షన్ తో పాటు వినోదం కూడా కావాల్సినంత ఉంటుందని ఆడియన్స్ కూడా భావిస్తారు.వీటిని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ రవితేజ సినిమాలు చేస్తున్నాడు.
తాజాగా క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ ని మాస్ రాజా తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం ఖిలాడీ సినిమా షూటింగ్ లో ఉన్నాడు.
ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి.దీని తర్వాత వరుసగా ముగ్గురు దర్శకులతో ప్రాజెక్ట్ లని ప్లాన్ చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో హీరోలు అందరూ నిర్మాతలుగా కూడా మారిపోయారు.సినిమా కోసం తమకి ఇస్తున్న రెమ్యునరేషన్ ని బడ్జెట్ రూపంలోకి మార్చేస్తూ సహ నిర్మాతలుగా మారిపోయి రామ్ చరణ్, మహేష్ బాబు, నాని, తారక్ లాంటి హీరోలు అందరూ నిర్మాతలుగా మారిపోయారు.
ఇప్పుడు రవితేజ కూడా నిర్మాతగా తన సొంత సినిమాలతో పాటు లో బడ్జెట్ మూవీస్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడు.దీనికోసం ఆర్.టీ వర్క్స్ పేరుతో బ్యానర్ రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయింది.ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా మినిమం, లో బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించాలని కొత్త దర్శకులని పరిచయం చేయాలని రవితేజ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే తన సినిమాలకి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండాలని అనుకుంటున్నట్లు బోగట్టా.