మాస్ మహారాజ రవితేజ తన ఎనర్జీ లెవెల్స్ కు తగ్గ సినిమా పడితే సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే విషయాన్ని మళ్ళీ ఒకసారి నిరూపించాడు.మొన్న సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.
చాలా రోజులుగా వరస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ అయిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
రాజా ది గ్రేట్ సినిమా తర్వాత మళ్ళీ వరస ప్లాపులతో ఉన్న రవితేజకు క్రాక్ సినిమా హిట్ అవ్వడం ఆయనలో జోష్ ను నింపింది.కరోనా కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే రిలీజ్ అయ్యినా.20 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.ఈ సినిమాలో రవితేజకు జోడీగా శృతి హాసన్ నటించింది.ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.అయితే రవితేజ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమా ప్రకటించాడు.శరత్ మండవ అనే కొత్త దర్శకుడుతో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న యాక్షన్ త్రిల్లర్.ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించబోతుంది.
అయితే ఇది ఇలా ఉండగా రాజా ది గ్రేట్ సినిమాతో తన కెరీర్ లో సూపర్ హిట్ అందించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట.ఇప్పటికే రవితేజ కు స్టోరీ లైన్ వినిపించాడని అది రవితేజకు బాగా నచ్చిందని టాక్ నడుస్తుంది.
రవితేజ అనిల్ రావిపూడిని స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పినట్టు టాక్ నడుస్తుంది.ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీగా ఉన్నారు.ఇవన్నీ పూర్తి అయితే కానీ ఈ సినిమా పట్టాలెక్కుతోంది.