రవితేజ హీరోగా నటించిన క్రాక్ చిత్రం విడుదలకు సిద్దం అవుతున్న సమయంలో కరోనా వచ్చింది.ఆ చిత్రం షూటింగ్ పూర్తి కాకుండానే రవితేజ ఈ లాక్ డౌన్లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అందులో మొదటగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా మొదట చేయబోతున్నాడు.వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన సినిమా నిరాశ పర్చింది.
అయినా కూడా మరోసారి రవితేజ ఆయనకు అవకాశం ఇచ్చాడు.ఈ కరోనా పరిస్థితులు కుదుట పడ్డ వెంటనే షూటింగ్ను మొదలు పెట్టేందుకు రమేష్ వర్మ ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఎంటర్టైన్మెంట్ను ఇందులో చూపించబోతున్నారు. రవితేజను ఎలా అయితే ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారో అలా ఈ చిత్రంలో చూపించబోతున్నారు.ఇక ఈ చిత్రానికి కిలాడీ అనే టైటిల్ను ఖరారు చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కిలాడీ టైటిల్తో రవితేజ మూవీకి మంచి ఇమేజ్ వస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాలో రాశిఖన్నాతో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
వచ్చే ఏడాది దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.