తెలుగులో అప్పట్లో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” అనే చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా తనూ రాయ్ హీరోయిన్ గా నటించింది.
కాగా ఈ చిత్రానికి ప్రముఖ స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి స్వర బాణీలు సమకూర్చాడు.అయితే అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బీ,సి సెంటర్లలో మంచి రికార్డులను నెలకొల్పింది.
అయితే ఇటీవలే ఈ చిత్రం విడుదలై 19 సంవత్సరాలు కావడంతో ప్రముఖ పిఆర్వో అయినటువంటి వంశీ శేఖర్ ఈ చిత్రానికి షూటింగ్ సమయంలో తీసినటువంటి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఈ చిత్రంలో మంచి ప్రేక్షకాదరణ పొందినటువంటి పాట “మల్లి కూయవే గువ్వా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అంతేగాక ఈ చిత్రం విడుదలయి 19 సంవత్సరాల అయినప్పటికీ పూరి మార్క్ మరియు అతడు చరిష్మా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెలుగులో “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ చిత్రంలో “అర్జున్ రెడ్డి” చిత్ర ఫేమ్ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.