ఈ ఫోటోలో రవి తేజతో ఉన్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో అప్పట్లో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం” అనే చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.కాగా ఈ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా తనూ రాయ్ హీరోయిన్ గా నటించింది.

 Itlu Sravani Subramanyam, Ravi Teja, Tollywood Movie,19 Years Completed , Puri J-TeluguStop.com

కాగా ఈ చిత్రానికి ప్రముఖ స్వర్గీయ సంగీత దర్శకుడు చక్రి స్వర బాణీలు సమకూర్చాడు.అయితే  అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం  బీ,సి సెంటర్లలో మంచి రికార్డులను నెలకొల్పింది.

అయితే ఇటీవలే ఈ చిత్రం విడుదలై 19 సంవత్సరాలు కావడంతో ప్రముఖ పిఆర్వో అయినటువంటి వంశీ శేఖర్ ఈ చిత్రానికి షూటింగ్ సమయంలో తీసినటువంటి కొన్ని వర్కింగ్ స్టిల్స్  ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు.ఈ చిత్రంలో మంచి ప్రేక్షకాదరణ పొందినటువంటి పాట “మల్లి కూయవే గువ్వా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 అంతేగాక ఈ చిత్రం విడుదలయి 19 సంవత్సరాల అయినప్పటికీ పూరి మార్క్ మరియు అతడు చరిష్మా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెలుగులో “ఫైటర్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

 ఈ చిత్రంలో “అర్జున్ రెడ్డి” చిత్ర ఫేమ్ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు ముంబై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube