మాస్ మహారాజ రవితేజ సంక్రాంతికి రిలీజైన క్రాక్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.తన కెరీర్ కు కీలకంగా మారిన క్రాక్ సినిమా హిట్ అవ్వడంతో రవితేజ ఫుల్ ఖుషీగా ఉన్నాడు.
మళ్ళీ మాస్ మహారాజా రవితేజ అని అనిపించుకున్నాడు.ఈ సినిమా తర్వాత రవితేజ వరస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రవితేజకు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లిమ్స్ నుండి మంచి స్పందన వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయ్యింది.ఈ టర్గెర్ చూస్తుంటే సస్పెన్స్ త్రిల్లర్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. రవితేజ జైలులో ఉన్నట్టు తెలుస్తుంది.ఎలాంటి డైలాగ్స్ లేకుండానే సినిమాపై అంచనాలు బాగా పెంచారు.చివరలో రవితేజ ఒక డైలాగ్ చెప్పాడు.మీరు ఎమోషన్స్ లేకుండా స్మార్ట్ గా ఆడితే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అంటూ చివర్లో చెప్పిన డైలాగ్ బాగా ఆకట్టుకుంది.
ఈ సినిమాలో అర్జున్ విలన్ గా నటిస్తున్నాడు.అంతేకాదు అనసూయ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది.ఈ టీజర్ చూస్తుంటే రవితేజ ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.సైకో లాగా సుత్తి పట్టుకుని అందరిని తలపై కొడుతున్నట్టు చూపించారు.
దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుని మే 28 న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.