మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఖిలాడి సినిమా షూటింగ్ హడావుడిగా చేస్తున్నారు.ఎందుకంటే ఈ సినిమాను క్రాక్ సందడి తగ్గక ముందే రవితేజ వేడి తగ్గక ముందే విడుదల చేయాలని భావిస్తున్నారు.
అందుకే ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న అభిమానుల్లో అంచనాలు మరింతగా పెంచేందుకు అని చిత్ర యూనిట్ సభ్యులు వరుసగా సినిమాలో నటించబోతున్న నటీ నటులను అధికారికంగా ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నట్లుగా ప్రకటించి అంచనాలు పెంచేశారు.మరో స్టార్ నటుడు ఉన్ని ముకుందన్ ను ఈ సినిమాలో నటింపజేస్తున్నట్లుగా ప్రకటించారు.
తాజాగా ఈ సినిమాలో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ కూడా నటించబోతున్నట్లుగా దర్శకుడు రమేష్ వర్మ అధికారికంగా ప్రకటించాడు.
రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఖిలాడి సినిమాలో రవితేజ చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు.
దానికి తోడు అర్జున్, ఉన్ని ముకుందన్, అనసూయ వంటి స్టార్ లు ఈ సినిమాలో కనిపించడం వల్ల అంచనాలు భారీగా ఉండే అవకాశం ఉంది.వారు అంతా కూడా ఈ సినిమాలో నటించడం వల్ల ఖచ్చితంగా సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకున్న క్రాక్ సినిమా వసూళ్లను క్రాక్ బ్రేక్ చేస్తుందనే నమ్మకంతో రమేష్ వర్మ ఉన్నాడు.రవితేజను జనాలు ఏ రేంజ్ లో చూడాలని అనుకుంటున్నారో అలా సినిమాను చూడబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది.ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ మాత్రమే చేయబోతుందా లేదంటే కీలకమైన పాత్రలో కూడా కనిపిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా డింపుల్ హయతీ మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
.