మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడీ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ను పూర్తి చేసిన రవితేజ త్వరలోనే శరత్ మండవ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూజా కార్యక్రమాలు జరిగాయి.పెద్ద ఎత్తున ఈ సినిమా పై అంచనాలు ఉన్నాయి.
షూటింగ్ కార్యక్రమం మొదలు పెట్టబోతున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ మొదలు అవ్వడంతో రవితేజ షూటింగ్ లకు బ్రేక్ వేశాడు.ఈ సినిమా చిత్రీకరణ కోసం ఒక వైపు సెట్టింగ్స్ నిర్మాణం జరుగుతున్నాయి.
సినిమా చిత్రీకరణ కోసం ఏర్పాటు చేస్తున్న సెట్స్ ను బట్టి ఇదో పీరియాడికల్ డ్రామాగా చెబుతున్నారు.
1980 మరియు 1990 నేపథ్యంలోని కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు టైటిల్ విషయంలో కూడా అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ప్రముఖ హీరోయిన్ ఈ సినిమా కోసం ఎంపిక చేయడం జరిగిందట.
రంగస్థలం వంటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో రవితేజ వింటేజ్ లుక్ ఖచ్చితంగా అభిమానులను అలరిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
రవితేజ మరియు శరత్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న మొదటి సినిమా ఇదే అయినా కూడా చాలా నమ్మకంతో ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో మేకర్స్ నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ మద్య కాలంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో సినిమా లు వరుసగా వస్తున్నాయి.
రవితేజ ఖిలాడీ సినిమా ఆగస్టులో విడుదల కాబోతుండగా కొత్త సినిమా మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో లేదా అంతకు ముందే విడుదల అయ్యే అవకాశం ఉంది.