అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని భార్యను చంపిన బ్యాంక్ మేనేజర్....

ప్రస్తుత కాలంలో కొందరు వ్యక్తులు వివాహేతర సంబంధాలు మోజులో పడి కట్టుకున్న వారిని కడ తేర్చడానికి కూడా వెనుకాడడం లేదు.తాజాగా ఓ వ్యక్తి బాధ్యతగల బ్యాంకు మేనేజర్ పదవిలో ఉండి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని ఏకంగా కట్టుకున్న భార్యనే తాను తీసుకునేటువంటి మందులలో సైనేడ్ బిల్లలు ఇచ్చి హత్య చేశాడు.

 Ravi Chaitanya Madana Palli-TeluguStop.com

వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాలోనీ మదనపల్లె ప్రాంతంలో రవి చైతన్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసముంటున్నాడు.అయితే ఇతడు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో మేనేజర్ గా పని చేస్తున్నాడు.

అయితే రవి గత కొద్ది రోజులుగా స్థానికంగా ఉన్నటువంటి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం తన భార్యకి  తెలియడంతో ఆమె అతడిని పలుమార్లు నిలదీసింది.

అయితే రవి భార్య అనారోగ్యానికి గురవ్వడంతో ఆమె పలు రకాల మందులను వాడుతుందేది.అయితే తాజాగా మరోమారు రవి అక్రమ సంబంధాన్ని గురించి నిలదీయగా ఆమెను చంపాలని అతడు పన్నాగం పన్నాడు.

Telugu Bank Manager, Chittoor, Chittoor Latest-Telugu Crime News(క్రైమ

ఈ క్రమంలో రవి అతడి భార్య వేసుకునేటువంటి మందులలో ఆమెకు తెలియకుండా సైనెడ్ బిళ్లను ఇచ్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.అయితే అల్లుడు ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి రవి అత్తమామలు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రవిని అదుపులోకి తీసుకొని విచారించగా అతడు ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు.

దీంతో విచారణ నిమిత్తమై నిందితుడుని రిమాండుకు తరలించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube