టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా, ఫిమేల్ సెంట్రిక్ కథలతో నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న అందాల భామ భూమిక.ఖుషి సినిమా ఈమెకి స్టార్ హీరోయిన్ ఇమేజ్ తీసుకొస్తే ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోలు, కుర్ర హీరోలు అందరితో భూమిక ఆదిపాడింది.
అదే సమయంలో అనసూయ, అమరావతి లాంటి ఫిమేల్ సెంట్రిక్ క్రైమ్ కథలు కూడా భూమిక లీడ్ యాక్టర్ గా చేసి లేడీ ఒరియాంటెడ్ సినిమాలకి టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంటుందని ప్రూవ్ చేసింది.టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ దర్శకుడుగా ముద్ర వేసుకున్న రవిబాబు ఆమెతో అనసూయ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్ ని సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి రవిబాబు మీడియా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
అనసూయ షూటింగ్ ప్రారంభానికి ఒక రోజు ముందు తన పాత్ర కోసం గుండు చేయించుకొని, మీసాలు, కనుబొమ్మలు కూడా గేసేసాను.అయితే సడెన్ గా భూమిక ఫోన్ చేసి తనకి ఒంట్లో బాగోలేదని, షూటింగ్ కి రాలేనని చెప్పింది.
ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసి మరుసటి రోజు అడిగితే ఇంకా తగ్గలేదని చెప్పింది.ముంబైకి వెళ్లిపోతున్నానని చెప్పేసింది.అప్పటి నుంచి 40 రోజులు ఆమె అందుబాటులో లేకపోవడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది.అయితే సినిమా కోసం మార్చుకున్న తన రూపంతో బయటకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాను.
తప్పదనుకుంటే టోపీ, కళ్ళజోడు పెట్టుకొని తిరగాల్సి వచ్చేది.అలా ఆమె కారణంగా తాను కొద్ది రోజుల పాటు డైరెక్ట్ గా తన పేస్ ని జనాలకి చూపించాలేకపోయాను అని రవిబాబు చెప్పుకొచ్చాడు.