తెలుగు లో విలన్ కమెడియన్ దర్శకుడు ఇలా ఓ చిత్రానికి సంబంధించి దాదాపుగా అన్ని పాత్రలకు న్యాయం చేయగల దర్శకుడు రవిబాబు గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.ఎప్పుడు విభిన్న కథనాలను పెంచుకోవడంతో పాటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుండే రవిబాబు ఈసారి మరో కొత్త ప్రయోగం తో ముందుకు వచ్చాడు.
అయితే ప్రస్తుతం రవిబాబు క్రష్ అనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఈ చిత్రాన్ని ఫ్లయింగ్ ఫ్రాక్స్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నటువంటి పోస్టర్లని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.ఇందులో హీరోయిన్ మరియు హీరోయిన్ ఇన్ఫెక్షన్ రాకుండా ధరించినటువంటి మాస్క్ వేసుకొని ముద్దు పెట్టుకుంటున్న పోస్టర్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంటోంది.
అంతేకాక జిమ్ లో హీరోలు మరియు హీరోయిన్ వర్కౌట్ చేస్తున్న పోస్టర్ కూడా బాగానే అలరిస్తోంది.అంతేగాక ఈ పోస్టర్ లకి బి సేఫ్ కరోనా ఔట్ బ్రేక్ అంటూ హ్యాష ట్యాగ్ తో ట్రెండింగ్ చేస్తున్నారు.
అయితే ఈ పోస్టర్లను నెటిజనులు ట్రోల్స్ చేస్తున్నారు.ఇందులో ప్రస్తుతం కరోనా వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందుతుండటం తో ఆ అంశాన్ని రఘుబాబు ఇలా వాడుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ రవిబాబు మాత్రం చిత్రానికి దర్శకత్వం వహించడమే కాక ఆ చిత్రాన్ని ప్రమోట్ చేసుకోవడంలో కూడా మంచి దిట్ట అని చెప్పవచ్చు.
అయితే గత కొద్ది కాలంగా రవిబాబు దర్శకత్వం వహించినటువంటి అదిగో, ఆవిరి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం పాలయ్యాయి.దీంతో రవిబాబు కథల విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాక ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ క్రష్ చిత్రం వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.