కాపు గర్జన సందర్బంగా తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో విధ్వంసకాండను నేరంగా పరిగణించాల్సిన అవసరమే లేదంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశ మవుతోంది.బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ నాడు జరిగిన దాడులు సమూహం జరిపిన హింసాకాండ గా మాత్రమే నేరంగా చూడరాదని, తుని ఘటన వెనుక జగన్, ఆతని పార్టీ ఉందంటూ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విమర్శలకు తెలుగుదేశం పార్టీ దిగటం ఆక్షేపణీయమని వ్యాఖ్యానించారు.
కాపు నాడు నేత ముద్రగడ దీక్ష సందర్భంగా తుని రైల్వే స్టేషన్లో రత్నాచల్ ఎక్స్ప్రెస్పైనా పోలీస్ స్టేషన్.లపై ఒకే పద్ధతుల్లో దాడి చేసి పెద్దఎత్తున పెట్రోల్ చల్లి ధ్వంసం చేయడం పై, విచారణ జరిపిన సిబిసిఐడి క్లూస్టీంలు ఆధారాలు సేకరించింది.
పెట్రోలు, రాడ్లు, కర్రలు, కత్తులు ముందస్తుగా తెచ్చి ఎక్కడ దాచిపెట్టారు, పెట్రోలు ఏ వాహనాలలో ఎక్కడ నుంచి తీసుకువచ్చారు.? అని అన్ని కోణాలలో విశ్లేషించి, పక్కా ప్రణాళికతోనే దాడులు జరిగినట్టు గుర్తించారు.మీడియా కెమెరాల వీడియా ఫుటేజ్ల ఆధారంగా అన్ని జిల్లాలకు చెందిన నిందితులను గుర్తించి, పలు యాక్టుల కింద కేసులు నమోదు చేసారు.ప్రభుత్వానికిచ్చిన నివేదిక ఆధారంగా ఇచ్చిన అనుమతుల మేరకు ఈ ఘటలలో పాల్గొన్న వారిని అరెస్టుల పర్వానికి తెరలేపిన విషయం విదితమే.