ప్రస్తుతం టాలీవుడ్లో రష్మిక మందన్న టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది.గీత గోవిందం చిత్రం తర్వాత ఈమెకు వచ్చిన క్రేజ్తో సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు అల్లు అర్జున్ వంటి క్రేజీ స్టార్లు కూడా ఈమెతో వర్క్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం స్టార్ హీరోలతో చాలా బిజీగా సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ రష్మిక ఇటీవల నాగచైతన్యతతో ఒక చిత్రంలో నటించాల్సిందిగా దిల్రాజు వచ్చి అడిగితే నో చెప్పిందట.పారితోషికం విషయంలో కాస్త ఎక్కువ ఆఫర్ చేసినా కూడా ఆమె నో చెప్పిందట.
ప్రస్తుతం మహేష్బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్లతో చేస్తున్న తాను నాగచైతన్య వంటి సెకండ్ గ్రేడ్ హీరోలతో చేయడం వల్ల తన క్రేజ్ తగ్గుతుందని రష్మిక భావించిందట.అందుకే ఆమె తనకు డేట్లు ఖాళీ లేవు అంటూ నాగచైతన్య మూవీకి నో చెప్పిందట.ప్రస్తుతం నితిన్తో నటిస్తున్న రష్మిక తమ హీరో నాగచైత్యనకు మాత్రం ఎందుకు నో చెప్పింది అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.నితిన్ కంటే నాగచైతన్య తక్కువ అయ్యాడా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.ఆ చిత్రంలో హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోంది.ఆ తర్వాత దిల్రాజు నిర్మాణంలో శశి దర్శకత్వంలో ఒక చిత్రంను నాగచైతన్య చేయబోతున్నాడు.ఆ సినిమాలో హీరోయిన్గా రష్మికను అనుకుంటే ఆమె హ్యాండ్ ఇచ్చింది.ఇప్పుడు మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది.నివేదా పేతురాజ్ ను హీరోయిన్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.