విజయదేవరకొండతో కలిసి గీతాగోవిందం సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్న రష్మిక మందాన తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో జత కట్టే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందాన సరిలేరు నీకెవ్వరు సినిమాలో సూపర్ స్టార్ తో కలిసి నటించి సూపర్ హిట్ అందుకుంది.దీంతో రష్మికకు టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి.
సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎంతో చలాకిగా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది రష్మిక.ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమాలో రష్మిక నటిస్తోంది.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడు అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోoది.
అయితే పుష్ప సినిమాలో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్న రష్మిక పుష్ప సినిమా షూటింగ్ జరుపుకుంటున్న రోజులలో తనకు నిద్ర సరిపోవడం లేదని రష్మిక తెలిపింది.
ఉదయం 5 గంటలకు షూటింగ్ మొదలు పెడితే సాయంత్రం 7 గంటలకు ప్యాకప్ చెబుతున్నారట డైరెక్టర్ సుకుమార్.అందుకే నిద్ర సరిపోవడం లేదని రష్మిక చెబుతోంది.
ఇప్పటికే భారీ బడ్జెట్ లో డైరెక్టర్ సుకుమార్ వెరైటీ టేకింగ్ తో తీస్తున్న ఈ పుష్ప సినిమా రష్మిక కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా మిగిలిపోయే అవకాశం ఉంది.