రష్మిక మందనా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.ఛలో సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ఈ భామ సినిమా కొంత నిరాశపరిచినా రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
కాని ఆ తరువాత గీత గోవిందం బ్లాక్ బస్టర్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇక ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన సరిలేరు నీకెవ్వరుతో ఇక టాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక ప్రస్తుతం తెలుగు, తమిళంలోనే కాక బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది రష్మిక.అయితే ఓ ఇంటర్ వ్యూ లో భాగంగా తన మనసులోని మాటను బయటపెట్టింది రష్మిక.
నాకు ఒక్కరోజు ప్రభాస్ తో డేటింగ్ చేయాలని ఉందని, ప్రభాస్ కు పెద్ద ఫ్యాన్ నని రష్మిక మందనా తెలిపింది.ప్రస్తుతం తెలుగులో లీడింగ్ హీరోయిన్ గా ఉన్న రష్మిక , అమితాబ్ సరసన బాలీవుడ్ లో నటిస్తోంది.
ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇక బాలీవుడ్ లో రష్మిక పాగా వేసే అవకాశం ఉంది.ఇంకా కరోనా వలన ప్రస్తుతానికి షూటింగ్స్ నిలిచిపోవడంతో కొత్త సినిమాలే ఒప్పుకోని రష్మిక, పరిస్థితులన్నీ సద్దుమణిగితే వరుస సినిమాలను పట్టాలెక్కించే అవకాశం ఉంది.