యంగ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న కాంబినేషన్ లో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల్లో గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తుండగా రష్మిక పుష్ప సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. నిన్న పూరీ విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లైగర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.
మొదట ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ పెట్టాలని భావించినా ఆ టైటిల్ వేరే సినిమాకు రిజిష్టర్ కావడంతో లైగర్ అనే టైటిల్ ను పెట్టారని సమాచారం.ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లైగర్ సినిమా ఫస్ట్ లుక్ గురించి నటి రష్మిక స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకెంతో ఆనందంగా ఉందని కిల్లర్ పోస్టర్ అని రష్మిక ఫస్ట్ లుక్ గురించి పేర్కొన్నారు.
థియేటర్లలో లైగర్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని రష్మిక అన్నారు.తనకెంతో ఇష్టమైన విజయ్, ఛార్మి, పూరీజగన్నాథ్ లకు ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు.లైగర్ సినిమాను స్క్రీన్ పై చూసే సమయంలో తాను డ్యాన్స్ చేస్తూ ఈలలు వేస్తానని పేర్కొన్నారు.రష్మిక చేసిన ట్వీట్ గురించి విజయ్ దేవరకొండ స్పందిస్తూ రుషీ.
లైగర్ సినిమా విడుదలైన సమయంలో ఎంతోమంది డ్యాన్సులు, ఈలలు వేస్తారని తాను మాటిస్తున్నానని పేర్కొన్నారు. లైగర్ సినిమాలోని కొంత భాగాన్ని రష్మిక చూసిందని ఈ విషయం తనకు కూడా తెలుసని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుండటం గమనార్హం.