కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది.ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తోంది.
ఇప్పటికే ఒక మెగా హీరోతో ఛాన్స్ కొట్టేసిన రష్మికకు మరో మెగా హీరోకు జోడీగా ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా రష్మికను ఫైనలైజ్ చేశారని సమాచారం.
రామ్ చరణ్ ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.కనిపించేది తక్కువ సమయమే అయినా సినిమాను మలుపు తిప్పే పాత్రలో చరణ్ నటిస్తాడని సమాచారం.
రష్మిక ఈ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా నటించబోతుందని తెలుస్తోంది.రష్మికను ఆచార్య సినిమా దర్శకనిర్మాతలు సంప్రదించగా ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.
నటించేది కొన్ని సన్నివేశాలే అయినా రష్మికకు భారీగా పారితోషికం ఆఫర్ చేశారని తెలుస్తోంది.
వచ్చే ఏడాది జనవరిలో రష్మిక, చరణ్ కాంబినేషన్ లో సీన్లు తెరకెక్కనున్నాయని సమాచారం.అయితే రష్మికను ఫైనల్ చేసినట్లు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.మొదట ఈ సినిమాలో చరణ్ కు జోడీగా కియానా అద్వానీని తీసుకోవాలని భావించినా గతంలో చరణ్, కియారా కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ విధేయ రామ ఫ్లాప్ కావడంతో దర్శకనిర్మాతలు వెనుకడుగు వేసినట్టు సమాచారం.
మరోవైపు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.చిరంజీవి, చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
కొరటాల ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్ కావడంతో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా విడుదల కానుంది.