ఈ రోజుల్లో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కేవలం కొన్ని సినిమాలలో మాత్రమే కనిపించి మాయమవుతున్నారు.హీరోలకున్నంత లైఫ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకి ఉండదు.
ప్రేక్షకులు కూడా హీరోయిన్ల విషయంలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ నెస్ కోరుకుంటున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో కూడా అందరితో గట్టిపోటీగా నిలబడి వరుస సినిమాలతో, తన నటనతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు రష్మిక మందన.
ఈ ఏడాది రష్మిక నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి చిత్రాలతో భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్న రష్మిక, అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ పాత్రలో రష్మిక నటిస్తున్నారు.అంతే కాకుండా ఇటీవలే హీరో శర్వానంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో హీరోయిన్ గా రష్మిక సంతకం చేసింది.
ఇలా వరుస విజయాలు, వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న రష్మిక, తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పెంచేసింది.
కరోనా కారణం వల్ల చిత్ర నిర్మాణాలు ఆగిపోవడంతో నిర్మాతలు భారీ నష్టాన్ని చవి చూస్తున్నారు.ఈ నేపథ్యంలో పలువురు హీరో,హీరోయిన్లు వారి రెమ్యూనరేషన్ విషయంలో కాస్త వెనక్కి తగ్గుతున్నప్పటికీ, రష్మిక మాత్రం తన రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ తేల్చి చెప్పేశారు.ఈ మధ్యకాలంలో ఎన్నో క్రేజీ ఆఫర్లు రష్మిక కు వచ్చాయట.
కానీ అందుకు ఆమె దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆ అవకాశాలను రష్మిక కోల్పోయిందనీ సినీ వర్గాల సమాచారం.ఈ విషయం తెలిసిన నెటిజన్లు రష్మిక కు కొన్ని జాగ్రత్తలను చెబుతూ కామెంట్లు కూడా చేస్తున్నారు.
రష్మిక ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ అమాంతం పెంచేయడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.