సౌత్ లో స్టార్ హీరోయిన్ గా బిజీ అవుతున్న కన్నడ భామ రష్మిక మందన.వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న ఈ భామ ప్రస్తుతం తెలుగులో పుష్ప సినిమాతో పాటు, ఆచార్యలో రామ్ చరణ్ కి జోడీగా అలాగే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వానంద్ తో జత కడుతుంది.
వీటితో పాటు తమిళంలో కార్తీకి జోడీగా సుల్తాన్ సినిమాలో నటిస్తుంది.తెలుగు, తమిళ భాషలలో వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారుతున్న ఈ అమ్మడు తన మాతృభాష కన్నడ మీద ప్రేమని చూపిస్తూనే ఉంది.
కర్ణాటక నుంచి చాలా మంది హీరోయిన్లు వచ్చారు.బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లు అయినా ఐశ్వర్య రాయ్, దీపికా పదుకునే, శిల్పా శెట్టి, పూజాహెగ్డే లాంటి అందాల భామలు అందరూ కర్ణాటక నుంచి వచ్చి స్టార్స్ అయినవారే అయితే వారు ఎప్పుడూ కూడా తమ మాతృభాష సినిమాలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు.
అయితే ఈ విషయంలో రష్మిక మాత్రం తాను ప్రత్యేకం అని రుజువు చేసుకుంది
తెలుగు, తమిళ బాషలలో వరుస అవకాశాలు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా మారి ఏకంగా రెండు కోట్ల రెమ్యునరేషన్ వరకు ఈ అమ్మడు అందుకుంటుంది.అయితే ఇక్కడ ఎంత క్రేజ్ వచ్చి కన్నడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూనే ఉంది.
అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది.దానికోసం తమ మాతృబాషలో తక్కువ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తారు కాబట్టి రెమ్యునరేషన్ కూడా సగానికి సగం తగ్గించుకొని తీసుకుంటుంది.
ఇతర భాషలో రెండు కోట్లు తీసుకుంటే కన్నడ ఇండస్ట్రీలో కేవలం 75 లక్షలు మాత్రమే తీసుకొని సినిమాలు చేస్తుంది.అక్కడ అది హైయెస్ట్ రెమ్యునరేషన్ అయినా కూడా తెలుగు, తమిళ సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ.
కానీ కేవలం మాతృభాష మీద ఉన్న ప్రేమతో ఆ రెమ్యునరేషన్ కి అక్కడ సినిమాలు చేస్తుంది.సౌందర్య తర్వాత కన్నడ సినిమాలకి ప్రాధాన్యత ఇస్తున్న స్టార్ హీరోయిన్ రష్మిక అని పేరు వినిపిస్తుంది.