తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన అదే ఊపుతో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.రష్మిక మందన తాజాగా నటించిన చిత్రం గుడ్ బైఅమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంతే కాకుండా ఈ సినిమాతో రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనుంది.
ఈ సందర్భంగా ప్రస్తుతం రష్మిక మందన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక 2019లో విడుదల అయిన డియర్ కామ్రేడ్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.డియర్ కామ్రేడ్ సినిమా లోని లిప్ లాక్ సన్నివేశంలో తనపై వచ్చిన ట్రోలింగ్స్ గురించి స్పందించింది.
ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.నేను ఆ రోజులను, ఆ లిప్ లాక్ సీన్ పై వస్తున్న ట్రూల్స్ ని ఎలా అధిగమించాను నాకే తెలియదు.
నేను చాలా సున్నితమైన మనస్కురాలిని.
కొంతమంది నాకు ఫోన్ చేసి బాగానే ఉంది అని చెప్పే వాళ్ళు.కొందరు మాత్రం దారుణంగా ట్రోలింగ్స్ చేసేవారు.ఆ సమయంలో నన్ను బాధించడం ఘటనలు చాలానే జరిగాయి.
నేను ఎవరినో వేడుకుంటున్నట్లుగా, నన్ను ఎవరో వెలివేసినట్టుగా కూడా కలలు వచ్చేవి.అలా కలలు వచ్చినప్పుడు నిద్రలో ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చే దాన్ని, అలా రాత్రి మొత్తం ఏడుస్తూ ఉండేదాన్ని అని తను చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది రష్మిక.
సినిమాల విషయానికి వస్తే. సిద్ధార్థ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాలో నటిస్తోంది.
అలాగే రణ్ బీర్ కపూర్ సరసన యానిమల్ సినిమాలో నటిస్తోంది రష్మిక మందన.