సౌత్ క్రేజీ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉంది.వరుస సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్స్ తో సినిమాలు చేస్తుంది.
ఒకదాని తర్వాత ఒకటి సినిమా చేస్తూ సౌత్, నార్త్ కి చక్కర్లు కొడుతుంది.తెలుగులో ఈ అమ్మడు పుష్ప సినిమా చేస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.మరో వైపు శర్వానంద్ కి జోడీగా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ సినిమా కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్తుంది.ఇదిలా ఉంటే మరో వైపు హిందీలో మిషన్ మజ్ఞు సినిమా కూడా ఈ అమ్మడు చేస్తుంది.
ఈ సినిమాలో సిద్ధార్ద్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.
ఈ నేపధ్యంలో సినిమా షూటింగ్ కోసం రష్మిక ముంబై, హైదరాబాద్ తిరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ సినిమానే కాకుండా హిందీలో మరో సినిమాలో కూడా నటించడానికి రష్మిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రముఖ దర్శకుడు వికాష్ బాల్ దర్శకత్వంలో అమితాబచ్చన్ కాంబినేషన్ లో రష్మిక నటించాబోతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ మనవరాలుగా రష్మిక కనిపించబోతుందని తెలుస్తుంది.
పావెల్ గులాటి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉన్నాడు.అతనికి జోడీగా రష్మిక కనిపించబోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి డెడ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేసారని మొన్నటివరకు టాక్ వినిపించింది.అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మరో కొత్త టైటిల్ ని పరిశీలిస్తున్నారు.
గుడ్ బై అనే టైటిల్ సినిమా కంటెంట్ కి కరెక్ట్ యాప్ట్ అవుతుందని భావించి దానినే ఫైనల్ చేయబోతున్నారని సమాచారం.ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ఏప్రిల్ నెలలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉందని బోగట్టా.