నాగ చైతన్య సమంత కలిసి నటించిన ఏమాయ చేసావె సినిమాకు సీక్వెల్ గా ఏమాయ చేసావె 2 ప్లానింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.గౌతం మీనన్ ఈ సినిమా కథ ఆల్రెడీ సిద్ధం చేశారట.
అయితే చైతు, సాం పెళ్లై విడిపోయాక ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ దాదాపు లేనట్టే.అందుకే సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని ఏమాయ చేసావె 2లో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఏమాయ చేసావె 2 సినిమాలో సమంత ప్లేస్ లో కన్నడ భామ రష్మిక మందన్న నటిస్తుందని తెలుస్తుంది.
ఇప్పటికే టాలీవుడ్ లో వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకెళ్తున్న రష్మిక ఇప్పుడు సూపర్ హిట్ సీక్వెల్ లో కూడా సమంత ప్లేస్ దక్కించుకోవడం క్రేజీగా మారింది.
రష్మిక కెరీర్ కి ఈ సినిమా మరింత బూస్టింగ్ ఇచ్చేలా ఉంది.ఏమాయ చెసావె 2 సినిమా తెలుగుతో పాటుగా తమిళంలో కూడా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
సమంత ఓ పక్క తనకు వచ్చిన మయోసైటిస్ వల్ల బాధపడుతుంది.దాని ట్రీట్ మెంట్ కోసమే ఫారిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. మరి ఏ మాయ చేసావె 2 నిజంగా ఉంటుందా చైతు రష్మికల జోడీ ఆ సీక్వెల్ లో నటిస్తారా లాంటి విషయాలపై త్వరలో క్లారిటీ వస్తుంది.