రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె అన్ని భాషలలోనూ సినిమా అవకాశాలను అందుకొని ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక తాజాగా వారసుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అదేవిధంగా జనవరి 20 వ తేదీన మిషన్ మజ్ను అనే బాలీవుడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీ లో విడుదలైంది.
ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.శంతను బాగ్చీ దర్శకత్వం వహించిన స్పై థ్రిల్లర్ మూవీ ‘మిషన్ మజ్ను’.
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకులను సందడి చేస్తుంది.ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈమె ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మిషన్ మజ్ను సినిమాకు కాను ఈమె ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయానికి వస్తే…ఈ సినిమా కోసం రష్మిక మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో రష్మిక నస్రీన్ అనే ఒక అంధురాలి పాత్రలో నటించి సందడి చేశారు.
అయితే ఈ పాత్రకు గాను ఈమె మూడు కోట్లు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్న రష్మిక ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులతో బిజీ కానున్నారు.