నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు.ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.
ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం టక్ జగదీష్ సినిమా సెట్స్ పైన ఉంది.లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఈ సినిమా తర్వాత శ్యామ్ సింగరాయ్ సినిమాని రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరపైకి తీసుకొని వెళ్ళబోతున్నాడు.ఈ సినిమా పీరియాడికల్ నేపధ్యంలో ఉంటుందని తెలుస్తుంది.
ఇందులో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా సాయి పల్లవి ఇప్పటికే ఎంపిక అయ్యింది.
ఇదిలా ఉంటే ఇందులో ఓ హీరోయిన్ రోల్ కోసం రష్మిక మందనని సంప్రదించగా ఆమె చేయడానికి ఇష్టం చూపించలేదని తెలుస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మేగ్జిమమ్ సోలో హీరోయిన్ గానే సినిమాలు చేయడానికి ఇష్టపడుతుంది.అది కూడా కమర్షియల్ సినిమాలు అయితేనే చేస్తానని కరాఖండిగా చెప్పేస్తుంది.
ఈ కారణంగానే ఆమె శ్యామ్ సింగరాయ్ సినిమాకి నో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.ఇందులో ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరుగా నటించడానికి ఆమె సిద్ధంగా లేదని, ఈ నేపధ్యంలోనే కథ కూడా వినడానికి ఆసక్తి చూపించలేదని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు.