రష్మిక మందాన… ప్రస్తుతం ఈమె గురించి దక్షిణ భారతదేశంలో ఉన్న సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లో ఛలో సినిమాతో మొదలైన తన సిని జైత్ర యాత్ర అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ కి చేరేలా చేసింది.
ఛలో సినిమా తర్వాత గీత గోవిందం తో భారీ హిట్ సాధించి టాలీవుడ్ ప్రేక్షకుల కుర్రకారుకు డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది.ఆ సినిమా తర్వాత రష్మిక మందాన బడా హీరోల సరసన నటించేందుకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సంవత్సరం మొదట్లో విడుదలైన మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు, హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రాలలో హీరోయిన్ గా నటించి తన హిట్ సినిమాల శాతాన్ని పెంచుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతున్న అల్లు అర్జున్, సుకుమార్ కాంబో సినిమా పుష్ప చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
అంతే కాదు తమిళ్ ఇండస్ట్రీ లో కూడా తన మొదటి సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది.ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందాన ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఓ ఊపు ఊపేస్తోంది.
తనకు సంబంధించిన వర్కౌట్స్, తన ప్రతి రోజు జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయో సంబంధించి ఫోటోలు, వీడియోలు.అలాగే వంటలకు సంబంధించిన వాటిని కూడా షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు అభిమానులు పోటెత్తుతున్నారు.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ భాషలలో హీరోయిన్ గా నటించడంతో ఆవిడ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.ఇకపోతే రష్మిక మందాన తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్స్ సంఖ్య ను 10 బిలియన్స్ మార్కును అందుకుంది.
అతి తక్కువ సమయంలోనే రష్మిక మందాన ఇంత ఫాలోయింగ్ ను చేరుకోవడంతో ఇప్పుడు సిని పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందాన.
దీనికి కారణం ఆవిడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం.ఏది ఏమైనా అతి తక్కువ సమయంలో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రష్మిక మందాన ని అభినందించకుండా ఉండలేము.