ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగడానికి పూజా హెగ్డే, రష్మిక మందన పోటీపడుతున్నారు.ప్రస్తుతం వీరిద్దరూ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న టాప్ హీరోల సరసన నటిస్తూ అగ్ర స్థానానికి చేరుకోవడానికి రెడీ అయిపోయారు.
వీరిద్దరూ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి అభిమానులను ఉత్సాహపరుస్తూ ఉంటారు.ఇక అసలు విషయంలోకి వెళితే.
టాలీవుడ్ ఇండస్ట్రీకి ఛలో సినిమాతో అడుగుపెట్టిన రష్మిక మందన ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ తర్వాత వరుస పెట్టి టాప్ హీరోల సరసన హిట్, ఫ్లాప్ అని తేడా లేకుండా వెనక్కి చూసుకోకుండా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ తెగ నటిస్తోంది.
ఈ సంవత్సరం మొదట్లో మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి మంచి ఫామ్ లో ఉంది.ఆ తర్వాత హీరో నితిన్ నటించిన భీష్మ సినిమాలో కూడా రష్మిక నటించి మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది.
దీంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి హీరో తన పక్కన రష్మిక ఉండాలి అని కోరుకునే స్థాయికి ఎదిగిపోయింది ఈవిడ.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజకు పోటీపడి మరి సినిమాలు చేస్తోంది.
ఈవిడ ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతుంది.రష్మిక మందన ప్రస్తుతం పుష్ప సినిమాతో కాకుండా మరో రెండు సినిమాలను కూడా లైన్లో పెట్టింది.
ఇది ఇలా ఉండగా ఫిజిక్ విషయంలో కూడా రష్మిక మందన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేర వేస్తోంది.కేవలం జిమ్ లో మాత్రమే కాకుండా బీచ్ లలో కూడా వర్కౌట్స్ చేస్తూ అందరిని తనవైపు తిప్పుకుంది.
తాజాగా మరోసారి రష్మిక మందన జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ కుర్రకారుకు పిచ్చెక్కించే కార్యక్రమాన్ని పెట్టుకుంది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.