టాలీవుడ్ లో ప్రస్తుతం కన్నడ బ్యూటీ రష్మిక మందన్న వరుస హిట్లతో దూసుకుపోతోంది.అంతేగాక ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు మరియు భీష్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.
దీంతో ఈ అమ్మడికి వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నాయి.అయితే ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్టువంటి “పుష్ప” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రంలో రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన కొన్ని పుకార్లు బలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.అయితే ఇందులో ముఖ్యంగా రష్మిక మందన్న ఈ చిత్రంలో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసేటువంటి ఓ మెయిన్ విలన్ కూతురు పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో రష్మిక మందన్న పాత్ర ఈ మొత్తం చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.
అంతేగాక ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా బన్నీ కూడా మాస్ యాంగిల్ కలిగినటువంటి లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయానికి సంబంధించిన పోస్టర్లు కూడా చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.దీంతో రోజు రోజుకి ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా ఈ చిత్రం ఎప్పుడు ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అం రష్మిక మందన్న కన్నడలో “పొగరు” అనే చిత్రంలో కూడా నటిస్తోంది.
అలాగే తమిళంలో కూడా “సుల్తాన్” అనే చిత్రంలో “స్టార్ హీరో కార్తీ” సరసన హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ చిత్రాలకి సంబంధించిన షూటింగ్ పనులు మొదలయినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు వాయిదా వేశారు.