టాలీవుడ్ లో అతి తక్కువ సమయానికే స్టార్ స్టేటస్ అందుకుని వరుస అవకాశాలతో దూసుకు పోతుంది రష్మిక మందన్న.ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో గలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతుంది.ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించనుంది.
ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే బాలీవుడ్ అవకాశం రావడంతో ఆ ఆఫర్ కూడా ఓకే చేసేసింది.
బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా కు జంటగా ”మిషన్ మజ్ను” సినిమాలో నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా రష్మిక ముంబై వెళ్ళింది.అయితే ఆ షూటింగ్ కేవలం ఒక్కరోజు మాత్రమే.నిన్న ముంబై లో షూటింగ్ లో పాల్గొని ఆ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఆ వెంటనే ఈ రోజు మళ్ళీ ”ఆడవాళ్ళు మీకు జోహార్లు” సినిమా షూటింగ్ కోసం ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకుంది.ఈ సినిమాలో రష్మిక కు జంటగా శర్వానంద్ నటిస్తున్నారు.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రష్మిక లుక్ రివీల్ చేసారు.
ఆ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
అందుకే రష్మిక ముంబై టూ హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ రెండు సినిమాలను బాలన్స్ చేసుకుంటుంది.ఈ సినిమాలతో పాటు అఖిల్, సురేందర్ రెడ్డి చేస్తున్న ఏజెంట్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.అంతేకాదు అమితాబ్ బచ్చన్ సినిమాలో కూడా రష్మిక కనిపించ బోతుంది.మొత్తానికి అమ్మడు మంచి జోష్ లో ఉంది.