గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకు పోతుంది.ప్రెసెంట్ ఈ అమ్మడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే బేధం లేకుండా ఎక్కడ అవకాశం పలకరిస్తే అక్కడికి వెళ్తుంది.
తెలుగులో రష్మిక ప్రెసెంట్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తుంది.ఇక ఈ సినిమాతో పాటు రష్మిక రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా నుండి దసరా పండుగ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.అయితే ఈ పోస్టర్ కు పాజిటివ్ రెస్పాన్స్ ఎంత వస్తుందో నెగిటివ్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో వస్తుంది.
ట్విట్టర్ లో రష్మిక మందన్న పై కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు.అయితే ఒక వ్యక్తి మాత్రం.రష్మిక ను మరీ దారుణంగా ట్రోల్ చేసాడు.”దీన్ని ఎలా తీసుకున్నారురా?” అంటూ రష్మిక ఫోటోను షేర్ చేస్తూ నిర్మాణ సంస్థ ను ట్యాగ్ చేసాడు.
అయితే ఈ నెటిజెన్ వేసిన ప్రశ్నకు రష్మిక మందన్న అదిరిపోయే సమాధానం చెప్పింది.
ఈమె స్పందన చుసిన రష్మిక అభిమానులు ఫిదా అవుతున్నారు.అతడికి చెప్పుతో కొట్టినట్టు జవాబు చెప్పింది.అతడిపై ఫైర్ అవ్వలేదు.
చాలా కూల్ గా సమాధానం చెప్పిన విధానం అభిమానులను ఆకట్టుకుంది.అతడు వేసిన ప్రశ్నకు రష్మిక.
”నా యాక్టింగ్ కోసం” అంటూ సమాధానం చెప్పింది.
ఈమె చెప్పిన దిమ్మతిరిగే సమాధానం విని నెటిజెన్ మరల స్పందించలేదు.హీరోయిన్స్ అన్నాక అందరికి నచ్చాల్సిన అవసరం లేదు.కానీ అతడు రెస్పెక్ట్ లేకుండా అడగడంతో నెటిజెన్స్ కూడా అతడిపై ఫైర్ అవుతున్నారు.
ఇక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా.కిషోర్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.