ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్ల సరసన కన్నడ రష్మిక మందన్న దూసుకుపోతోంది.అయితే ఈ అమ్మడు నటించింది తక్కువ చిత్రాలే అయినా తన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంతేగాక ఇటీవల ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాలు మంచి హిట్ అవ్వడంతో పలు స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది.అయితే ఈ మధ్య కాలంలో రష్మిక మందన్న సినిమా షూటింగ్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.
అయితే తాజాగా రష్మిక మందన్న సోషల్ మీడియా మాద్యమాల ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది.
అయితే ఇందులో భాగంగా మీ బాల్యం లో జరిగినటువంటి ఓ సంఘటన గురించి తెలియజేయండి అని అడిగాడు.
రష్మిక మందన్న స్పందిస్తూ తాను చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ట్యూషన్ కి వెళ్లే సమయంలో ఓ ఇంటిలో ఉన్నటువంటి మామిడి చెట్టు కాయలను దొంగలించామని అది గమనించిన టువంటి ఇంటి యజమానురాలు తమన్ ని తిడుతూ కర్రతో కొట్టేందుకు తరుముకుంటూ వచ్చిందని సరదాగా రిప్లై ఇచ్చింది.సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి సరిలేరు నీకెవ్వరు, భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యాయి.దీంతో రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న అటువంటి పుష్ప అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తమిళం, కన్నడ భాషలో కూడా నటించే అక్షాంశాలు దక్కించుకుంది.