మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సైరా నరసింహారెడ్డి వంటి సినిమా తరువాత ఈ సినిమా వస్తుండటంతో ఆచార్యపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇప్పటికే షూటింగ్ 40 శాతం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది.
ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.తొలుత ఈ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తాడనే వార్తలు వినిపించినా అది నిజం కాలేదు.
దీంతో చరణ్ చేయబోయే పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే ఈ సినిమాలో చరణ్ పాత్రకు జోడీగా ఓ హీరోయిన్ కూడా ఉంటుందట.
గతంలోనే ఈ పాత్ర కోసం పూజా హెగ్డే, సమంత, కియారా అద్వానీ లాంటి స్టార్స్ పేర్లు వినిపించినా వారెవ్వరూ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదట.దీంతో ఈ ఆఫర్ కాస్త కన్నడ బ్యూటీ రష్మిక మందన్నకు వెళ్లిందట.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కేమియో పాత్ర అనగానే రష్మిక ఎగిరి గంతేసినట్లు తెలుస్తోంది.తన పాత్ర గురించి ఎలాంటి వివరాలు తెలుసుకోకుండానే ఓకే చెప్పేసిందట ఈ కన్నడ చిన్నది.
కాగా ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప అనే సినిమాలో నటించేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.ఇక చరణ్ గెస్ట్ రోల్లో నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ను త్వరలోనే తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.