కన్నడ బ్యూటీ రష్మక మందన ప్రస్తుతం టాలీవుడ్లో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా దూసుకుపోతుంది.అమ్మడికి వరుసబెట్టి ఆఫర్లు వస్తుండటంతో పాటు ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్లుగా నిలుస్తుండటంతో ఈ బ్యూటీకి స్టార్ హీరోల పక్కనే నటించే ఛాన్సులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి.
ఇప్పటికే మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన రష్మిక, తన నటనతో అందరినీ మెప్పించింది.
ఇక త్రివిక్రమ్ తన నెక్ట్స్ మూవీని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందనను ఎంపిక చేశాడు ఈ డైరెక్టర్.ఆ తరువాత తన నెక్ట్స్ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయనున్న త్రివిక్రమ్, ఆ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ను మరోసారి ఈ కన్నడ పాపకే ఇచ్చాడట.
దీంతో ఈ బ్యూటీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది.
మరి త్రివిక్రమ్-తారక్ సినిమాలో అమ్మడికి ఎలాంటి పాత్ర లభిస్తుందో, అందులో ఆమె ఎలా మెప్పిస్తుందో చూడాలి.ఇక యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.ఏదేమైనా వరుస సినిమాలతో రష్మిక టాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
.