మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో కేమియో పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా రామ్ చరణ్ చేసే పాత్రకు హీరోయిన్ కూడా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ పాత్రలో ఎవరిని నటింపజేయాలా అని చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతోంది.ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అయితే బాగుంటుందని పలువురు అభిప్రాయ పడ్డారు.
కానీ కియారా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాలో చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్నను ఈ సినిమాలో తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
చరణ్ సరసన రష్మిక అయితే బాగుంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు.మరి ఈ సినిమాలో నటించేందుకు అమ్మడు ఓకే అంటుందో లేదో చూడాలి.