టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న అందాల భామ రష్మిక మందన.ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు, శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలలో నటిస్తుంది.
అలాగే తమిళంలో సుల్తాన్ సినిమాలో కార్తీకి జోడీగా సందడి చేయబోతుంది.ఇదిలా ఉంటే సౌత్ లో మోస్ట్ క్రేజియస్ట్ బ్యూటీగా దూసుకుపోతున్న ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ డియర్ కామ్రేడ్ సినిమాని ఫీమేల్ సెంట్రిక్ స్టోరీగా మార్చి బాలీవుడ్ లో రష్మికని లీడ్ రోల్ గా పెట్టి రీమేక్ చేయాలని అనుకున్నారు.ఆ ప్రపోజల్ కూడా రష్మిక ముందు కరణ్ జోహార్ ఉంచారు.
అయితే తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ కావడంతో కరణ్ జోహార్ రీమేక్ చేయాలనే ప్రయత్నం చేయలేదు.అలాగే రష్మిక కూడా బాలీవుడ్ ఆలోచన వదిలేసింది.
అయితే అక్కడ యంగ్ హీరోలకి జోడీగా అమ్మడుని సంప్రదిస్తున్నారు.అయితే తెలుగులో మంచి సినిమాలు చేస్తూ ఉండటంతో వద్దనుకుంటూ వస్తుంది.
అయితే ఉప్పుడు అకస్మాత్తుగా ఆమె బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది.
బాలీవుడ్ ప్రముఖ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర కథానాయకుడిగా రూపొందుతున్న మిషన్ మజ్ను సినిమాలో రష్మిక మదన హీరోయిన్ గా నటిస్తోంది.1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో రా ఏజెంట్గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు.
అతని సరసన కథానాయికగా రష్మిక కన్ఫర్మ్ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కూడా రష్మిక పాల్గొందని టాక్.
యాడ్ ఫిల్మ్ మేకర్ షంతాను బాచి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో రష్మిక నటిస్తున్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు.