కన్నడ కుట్టి రష్మిక మందన వరుసబెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది.ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ఆ తరువాత గీతా గోవిందం చిత్రంతో అదిరిపోయో బ్లాక్బస్టర్ను తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఆ సినిమా నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా దూసుకుపోతుంది ఈ బ్యూటీ.కాగా ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించి మెప్పించిన ఈ బ్యూటీ అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకుంది.
ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ, తమిళంలో మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు.తమిళ హీరో కార్తీ నటిస్తున్న ‘సుల్తాన్’ అనే సినిమాలో హీరోయిన్గా తొలి తమిళ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ముగించుకుంది.
దీంతో అమ్మడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తన తొలి తమిళ సినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని రష్మిక ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
బక్కియరాజ్ కన్నన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కార్తి పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది.తెలుగులో అదిరిపోయే క్రేజ్ను దక్కించుకున్న రష్మిక మందన, తమిళంలో ఎలాంటి గుర్తింపును తెచ్చుకుంటుందో తెలియాలంటే సుల్తాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా పుష్ప చిత్ర షూటింగ్ను తిరిగి ప్రారంభించగానే రష్మిక అందులో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.