టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న అందాల భామ రష్మిక మందన.చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి గీతాగోవిందం సినిమాతో టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ హీరోయిన్ గా మారిపోయింది.
వరుస హిట్ సినిమాలతో మంచి స్పీడ్ మీద ఉన్న రష్మిక తెలుగులో ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు, తమిళంలో సుల్తాన్ సినిమాలు చేస్తుంది.ఈ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది.
అక్కడ మిషన్ మజ్ను సినిమాతో సిద్ధార్ధ్ మల్హోత్రాకి జోడీగా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది.
ఇందులో చాలా ఇంటరెస్టింగ్ రోల్ తాను పోషిస్తున్నట్లు రష్మిక కూడా క్లారిటీ ఇచ్చింది.ఈ సినిమాపై చాలా ఆసక్తి చూపిస్తుంది.
మిషన్ మజ్ను హిట్ అయితే బాలీవుడ్ లో తన హవా స్టార్ట్ అయిపోతుందని రష్మిక నమ్ముతుంది.అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాని రష్మిక ఓకే కన్ఫర్మ్ చేసిందని తెలుస్తుంది.
అది కూడా అమితాబచ్చన్ లాంటి స్టార్ నటుడు కాంబినేషన్ నటించే అవకాశం సొంతం చేసుకుందని తెలుస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ వికాస్ బల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం రష్మిక చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది.డెడ్లీ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా కథ ఒక తండ్రి – కూతురు మధ్య తిరుగుతుందని సమాచారం.ఎమోషనల్ అంశాలతో తండ్రి, కూతుళ్ళ సెంటిమెంట్ తో ఈ సినిమాను తీయనున్నారట.2021 మార్చి నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాను రిలయన్స్ సంస్థ నిర్మించనుంది.ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రానుందని తెలుస్తుంది.
ఒకవేళ రష్మిక బాలీవుడ్ లో పాగా వేస్తే మాత్రం అలియా భట్ కి పోటీగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.