టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసకుపోతోంది.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన అదే ఊపుతో వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతోంది.
రష్మిక మందన తాజాగా నటించిన చిత్రం గుడ్ బై. అక్టోబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇక విడుదల తేదికి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది రష్మిక మందన.
ఇంటర్వ్యూలో భాగంగాతన తన స్వయంవరం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.సదరు యాంకర్ మీ స్వయంవరంలో ఎవరెవరు ఉండాలి అని అడగగా.
ఆ విషయం పై స్పందించిన రష్మిక మందన.ప్రస్తుతం తాను వర్క్ చేస్తున్న హీరోలు అందరూ ఉండాలి అంటూ ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది.
రణబీర్ కపూర్, విజయ్ తలపతి, అల్లు అర్జున్ ఉండాలీ అనుకుంటున్నట్లు తెలిపింది ఈ బ్యూటి.అదేవిదంగా అలాగే జీలే జరా వంటి సినిమాలో అవకాశం వస్తే అలియా భట్, సమంతతో కలిసి నటించాలని ఉంది అని తెలిపింది రష్మిక మందన.
ఇకపోతే రష్మిక మందన విషయానికి వస్తే.టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో బన్నీ సరసన నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో రష్మిక మందన క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.అల్లు అర్జున్ కి మాత్రమే కాకుండా రష్మిక మందనకు కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి.ఇప్పటికే ఈమె పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.పుష్ప సినిమాలో రష్మిక మందన నటన డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పుష్ప 2 కోసం అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.