శర్వానంద్ తో జత కట్టబోతున్న రష్మిక మందన

క్రేజీ హీరోయిన్ రష్మిక మందన చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉంది.వరుసగా అవకాశాలు అందుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోతుంది.

 Rashmika Mandanna Romance With Sharwanand, Tollywood, Telugu Cinema, Kishore Tir-TeluguStop.com

భీష్మ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలతో వరుసగా రెండు సాలిడ్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడీగా పుష్ప సినిమాలో నటిస్తుంది.దీంతో పాటు తెలుగు,తమిళ బాషలలో తెరకెక్కుతున్న కార్తీ సుల్తాన్ సినిమాలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

ఈ రెండు సినిమాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.వీటితో పాటు రష్మిక వచ్చే ఏడాది మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అది కూడా కుర్ర హీరో శర్వానంద్ కి జోడీగా నటించడానికి ఒకే చెప్పింది.
శర్వానంద్, కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చే ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

కిషోర్ స్టైల్ లో ఉండే ఫీల్ గుడ్ ఫామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది.ఇందులో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ రష్మికని ఖరారు చేసినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం శర్వానంద్ బైలింగ్వల్ మూవీతో పాటు శ్రీకారం సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు.ఈ సినిమా తర్వాత వచ్చే ఏడాది ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించే అవకాశం ఉంది.ఇదిలా ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో అఫీషియల్ గా ప్రకటించే అవకాశం ఉంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube