కన్నడ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా కమర్షియల్ సినిమాలతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి దూసుకుపోయింది.టాలీవుడ్ దర్శకులకి ప్రస్తుతం రష్మిక హాట్ కేక్.
స్టార్ లతో సినిమాలు చేసే ప్రతి ఒక్కరు ముందుగా రష్మిక మీదనే దృష్టి పెడుతున్నారు.నటన, డాన్స్ విషయంలో టాలెంట్ ఉండటంతో దర్శకులకి కావాల్సిన విధంగా చేయడానికి ఆమె రెడీగా ఉండటంతో స్టార్ దర్శకులు మెయిన్ ఛాయస్ గా రష్మిక మారిపోయింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే, కీర్తిసురేష్, రష్మిక మధ్య ప్రధాన పోటీ నడుస్తుంది.పూజా హెగ్డే కేవలం సౌత్ సినిమాల మీదనే కాకుండా బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టడంతో ఆమె డేట్స్ దొరకడం కష్టం అయిపోతుంది.
ఇక కీర్తి సురేష్ అయితే సౌత్ లో అన్ని భాషలలో సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది సినిమాల వరకు లైన్ గా ఉన్నాయి.
ఇప్పట్లో కొత్త సినిమాకి డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదు.
అయితే రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తుంది.
దాంతో పాటు ఆచార్యలో రామ్ చరణ్ కి జోడీగా ఈ భామని ఫైనల్ చేశారని తెలుస్తుంది.దీంతో పాటు అఖిల్ సినిమా కోసం సురేందర్ రెడ్డి కూడా ఈ భామనే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు.
ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమా కోసం రష్మికని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. పూజా హెగ్డేని ముందుగా అనుకున్న ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రష్మికని తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు బోగట్టా.
ఈ భామ కూడా పవన్ కళ్యాణ్ తో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.మొత్తానికి కన్నడ పోరికి వరుసగా మెగా హీరోలతో రొమాన్స్ చేసే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.